Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ కూడా అదే తప్పు చేశాడు.. సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (12:36 IST)
క్రికెట్‌లో బంతి షైన్ అవ్వాలంటేనే క్రికెటర్లు దానిపై ఉమ్మి రాయడం చాలాకాలంగా చేస్తున్నారు క్రికెటర్లు. కానీ కరోనా నిబంధనల కారణంగా ఆ పనిచేయడానికి ఇప్పుడు లేదు. కొద్దిరోజుల కిందట రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రాబిన్ ఊతప్ప అదే పొరపాటును చేసి విమర్శలు అందుకున్నాడు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే తప్పు చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు. వెంటనే తన తప్పు తెలుసుకోవడం విశేషం.
 
ఢిల్లీ కాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ లో మూడో ఓవర్ జరుగుతున్న వేళ, ఓపెనర్ పృథ్వీ షా ఆడిన షాట్‌ను షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ అడ్డుకున్నాడు. ఆపై తన నోటి నుంచి ఉమ్మిని తీసి బంతికి పూశాడు. ఆ వెంటనే తాను చేసిన తప్పు తెలుసుకుని, పొరపాటై పోయిందన్నట్టు సంజ్ఞ చేశాడు. ఈ ఘటనపై సరదా కామెంట్లు వస్తున్నాయి.
 
కరోనా ముప్పు దృష్ట్యా సలైవా వాడకాన్ని ఐసీసీ జూన్‌లో తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు తప్పు చేస్తే హెచ్చరించాలని, అయినా రిపీట్ చేస్తే ఐదు పరుగుల పెనాల్టీ ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చింది. దీనిపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. "గెలిచే కసిలో అంతే... అప్పుడప్పుడూ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి" అంటూ సచిన్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

తర్వాతి కథనం
Show comments